Monday, November 30, 2009

Sunday, November 29, 2009

సండే స్పెషల్ : వీడు నేను అనుకున్నదానికంటే మూర్ఖుడు


2012 యుగాంతం : డార్విన్ పరిణామ సిద్ధాంతం



2012 : యుగాంతం సినిమా వచ్చి రెండు వారాలు  గడిచిపోయింది ... సినిమా హాళ్ళ దగ్గర జనాన్ని చూస్తుంటే అది  విజయవంతమైనట్లే  కనిపిస్తుంది . చాలా  మంది  బ్లాగర్లు  దీనిమీద  రివ్యూలు  కూడా  రాసారు .  అయితే సినిమా చూసే ప్రేక్షకులు ( అత్యధికులు ) దర్శకుడి కోణంలో( Human emotions at the end if life)  గాకుండా తమ కోణంలో ( గ్రాఫిక్స్) చూసారు. ఒకవేళ గ్రాఫిక్స్ కోసమే అయితే ఈ సినిమా చూడటం శుద్ధ దండగ ... దీనికోసం ఇదే దర్శకుడు  దాదాపు ఇదే కధాంశంతో తీసిన Day After Tomarrow ఎంతో మేలు. ఈ సినిమాలో హీరో చేసే పనికిమాలిన సాహసాలు పక్కనపెడితే - అంతర్లీనంగా డార్విన్ పరిణామ సిద్ధాంతం కనిపిస్తుంది. 

              ఇక అసలు విషయానికొస్తే ... ఈ సినిమా  కధ భారతదేశంలో మొదలయ్యి భారత సరిహద్దులలో సమాప్తం అవుతుంది. భారతదేశానికి చెందిన ఒక యువ శాస్త్రవేత్త  అతి త్వరలో భూమి అంతం కాబోతుందని తెలియజేస్తాడు. ఈ విషయం వివిధ దేశాధినేతలు , ప్రపంచ ప్రసిద్ది చెందిన వ్యాపారవేత్తలు , ప్రముఖులకు తప్ప సామాన్య ప్రజలకు తెలియదు.  ప్రపంచంలోని మనవ జాతి మనుగడ కోసం  చైనా రహస్యంగా షిప్పులను తయారుచేస్తుంది. ఈ షిప్పులు దేశాధినేతలు , ప్రపంచ ప్రసిద్ద ధనవంతులు , ప్రముఖుల కోసం ఉద్దేశింపబడినవి. వీటిలో సామాన్యులకు ప్రవేశం లేదు. యుగాంతం దగ్గర పడుతుంది ... ఇక అక్కడ నుండి మొదలవుతుంది జీవనపోరాటం ( Struggle For Existence) ... డబ్బున్న మారాజులంతా ఎలాగైనా సరే బ్రతికి బట్టకట్టాలని ఆ షిప్పుల్లో టిక్కెట్లు కొనుక్కుంటారు . ఎప్పటిలాగే అక్కడ కూడా ఎవరిస్థాయికి  తగ్గ టిక్కెట్లు వారికుంటాయి. చచ్చే ముందు కూడా మనిషి తారతమ్యాలు మరువడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక యుగాంతం రోజు ( డిశెంబర్ 21)  రానే వస్తుంది. ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది ... ఈలోపు టిక్కెట్లు కొన్న వాళ్ళు  అంతా షిప్పుల దగ్గరికి చేరిపోతుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు , రోమ్ లోని  పోప్  ఇద్దరూ తమ ప్రజలను విడిచి రావడానికి అంగీకరించరు ... వారు తమ తమ ప్రజలతో కలిసి చనిపోవాలని నిశ్చయించుకుంటారు. సహజంగా అమెరికన్లు తమను తాము హీరోలుగా చిత్రించుకుంటూ ఉంటారు ... దానికి ఉదాహరనే ఈ చిత్రంలోని హీరో , అమెరికా అధ్యక్షుడి పాత్రలు. ఇదే విషయాన్నీ బిన్ లాడెన్ ఆఫ్గాన్ యుద్ధ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి అంటాడు - " వాళ్ళు సినిమాల్లోనే హీరోలు ... నిజజీవితంలో కాదు" అని. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అమెరికన్లందరికీ ప్రతీక ...త్యాగమూర్తి ... అంటే అమెరికన్లు త్యాగమూర్తులు  అన్నమాట ... ఇక అమెరికన్లకూ పోప్ కు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే . చైనా లోనున్న షిప్పులను చేరుకోవడానికి ప్రముఖులు పడే తపన నిజంగా డార్విన్  ' మనుగడ కోసం పోరాటం ( Struggle For Existence)' ను గుర్తుకుతెస్తుంది . వీళ్ళవే ప్రాణాలా  ?  మిగతావాల్లవి  ప్రాణాలు కాదా ?  అనిపిస్తుంది .. ఈ పోరాటంలో  సామాన్యులు వెనుకబడిపోతారు ... బలవంతులు ( దేశాధినేతలు , వ్యాపారవేత్తలు) Survive  అవుతారు . పనిలోపనిగా జీవ వైవిధ్యం ( Bio - Diversity ) కోసం వీళ్ళంతా తమతోపాటు షిప్పులలో వివిధ జంతువులను ( ఏనుగులు , కుక్కలు, జిరాఫీ మొదలైనవి) తీసుకువెళతారు.కానీ అనుకోకుండా కొంతమంది అతి సామాన్యులకు  షిప్పులో చోటు దొరుకుతుంది. షిప్పులోని ప్రముఖులతో పోల్చితే వీరి సంఖ్య స్వల్పమే. ఈ జీవ వైవిధ్యంలో భారతీయులకు , సామాన్యులకు చోటుండదు ... ఎందుకంటే అప్పటికే భారత దేశం నాశనమైపోతుంది ... చివరికి ఈ ఉపద్రవాన్ని కనిపెట్టిన యువ శాస్త్రవేత్త కుటుంబం కూడా . బహూశా మనుగడ కోసం  పోరాటంలో భారతీయులు , సామాన్య ప్రజానీకం వెనుకబడిపోయారు అనడానికి ఇది సంకేతం కావచ్చు !!?? ... అంటే రెండవ మానవ పరిణామ క్రమంలో ( మనకు తెలిసినంత వరకూ ఇప్పుడున్నది మొదటి మానవ పరిణామ క్రమం )  భారతీయులకు చోటు లేదన్న మాట. ఇది ' Survival Of Fittest ' ను గుర్తుకుతెస్తుంది.
     ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం మొత్తం జలమయం అవుతుంది. చివరికి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ( ప్రస్తుతం దీని ఎత్తు : 8848 మీ. ) కూడా మునిగిపోతుంది ... షిప్పుల్లోని వారంతా బ్రతుకుతారు. కొన్ని రోజులపాటు  ఆ షిప్పులలోనే వీరి  ప్రయాణం  సాగుతుంది ... ఈలోపు ప్రకృతి కొంచెం  శాంతిస్తుంది ... సముద్రాలు వెనక్కు తగ్గుతాయి ... అప్పటికి ఆఫ్రికా ఖండం లోని ఒక పర్వతం ( పేరు గుర్తు లేదు ... బహూశా Ruwenzori పర్వతం కావచ్చు. దీని ప్రస్తుత ఎత్తు :5109 మీ. ) ఎత్తైన ప్రాంతంగా ఆవిర్భవిస్తుంది. ఆ పర్వతం వీరికి ఆవాసంగా మారుతుంది. అంటే అక్కడ నుండి రెండో మానవ పరిణామ క్రమం  ( నిజానికి దీనిని పరిణామం అనకూడదు ... ఎందుకంటే ఇక్కడ మానవుడు పూర్తిగా నాశనం కాలేదు... ఇది మొదటి పరిణామ క్రమానికి కొనసాగింపు )  మొదలవుతుందన్న మాట. ఈ కొత్త జాతిలో అందరూ ఉంటారు ... భారతీయులు తప్ప. విచిత్రమేమిటంటే ... మొదటి మానవ పరిణామ క్రమం కూడా అఫ్రికాలోనే మొదలవ్వడం . ఇక రెండో పరిణామ క్రమంలో ఎంతమంది Survive అయ్యారనేది ఉహాతీతమైనది ...ఎందుకంటే అంతమంది బలవంతుల మధ్య ఈ అతి కొద్ది మంది సామాన్యులు నెగ్గుకురావడం కష్టమే.ఇది Natural Selection కి సంబంధించినది           

Saturday, November 28, 2009

బుడ్డోడు తోక జాడిస్తే నాతో చెప్పండి ... మేడం తో చెప్పి కట్ చేయిస్తా


  

2012 యుగాంతం : డార్విన్ పరిణామ సిద్ధాంతం


  2012 : యుగాంతం సినిమా వచ్చి రెండు వారాలు  గడిచిపోయింది ... సినిమా హాళ్ళ దగ్గర జనాన్ని చూస్తుంటే అది  విజయవంతమైనట్లే  కనిపిస్తుంది . చాలా  మంది  బ్లాగర్లు  దీనిమీద  రివ్యూలు  కూడా  రాసారు .  అయితే సినిమా చూసే ప్రేక్షకులు ( అత్యధికులు ) దర్శకుడి కోణంలో( Human emotions at the end if life)  గాకుండా తమ కోణంలో ( గ్రాఫిక్స్) చూసారు. ఒకవేళ గ్రాఫిక్స్ కోసమే అయితే ఈ సినిమా చూడటం శుద్ధ దండగ ... దీనికోసం ఇదే దర్శకుడు  దాదాపు ఇదే కధాంశంతో తీసిన Day After Tomarrow ఎంతో మేలు. ఈ సినిమాలో హీరో చేసే పనికిమాలిన సాహసాలు పక్కనపెడితే - అంతర్లీనంగా డార్విన్ పరిణామ సిద్ధాంతం కనిపిస్తుంది. 
              ఇక అసలు విషయానికొస్తే ... ఈ సినిమా  కధ భారతదేశంలో మొదలయ్యి భారత సరిహద్దులలో సమాప్తం అవుతుంది. భారతదేశానికి చెందిన ఒక యువ శాస్త్రవేత్త  అతి త్వరలో భూమి అంతం కాబోతుందని తెలియజేస్తాడు. ఈ విషయం వివిధ దేశాధినేతలు , ప్రపంచ ప్రసిద్ది చెందిన వ్యాపారవేత్తలు , ప్రముఖులకు తప్ప సామాన్య ప్రజలకు తెలియదు.  ప్రపంచంలోని మనవ జాతి మనుగడ కోసం  చైనా రహస్యంగా షిప్పులను తయారుచేస్తుంది. ఈ షిప్పులు దేశాధినేతలు , ప్రపంచ ప్రసిద్ద ధనవంతులు , ప్రముఖుల కోసం ఉద్దేశింపబడినవి. వీటిలో సామాన్యులకు ప్రవేశం లేదు. యుగాంతం దగ్గర పడుతుంది ... ఇక అక్కడ నుండి మొదలవుతుంది జీవనపోరాటం ( Struggle For Existence) ... డబ్బున్న మారాజులంతా ఎలాగైనా సరే బ్రతికి బట్టకట్టాలని ఆ షిప్పుల్లో టిక్కెట్లు కొనుక్కుంటారు . ఎప్పటిలాగే అక్కడ కూడా ఎవరిస్థాయికి  తగ్గ టిక్కెట్లు వారికుంటాయి. చచ్చే ముందు కూడా మనిషి తారతమ్యాలు మరువడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక యుగాంతం రోజు ( డిశెంబర్ 21)  రానే వస్తుంది. ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది ... ఈలోపు టిక్కెట్లు కొన్న వాళ్ళు  అంతా షిప్పుల దగ్గరికి చేరిపోతుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు , రోమ్ లోని  పోప్  ఇద్దరూ తమ ప్రజలను విడిచి రావడానికి అంగీకరించరు ... వారు తమ తమ ప్రజలతో కలిసి చనిపోవాలని నిశ్చయించుకుంటారు. సహజంగా అమెరికన్లు తమను తాము హీరోలుగా చిత్రించుకుంటూ ఉంటారు ... దానికి ఉదాహరనే ఈ చిత్రంలోని హీరో , అమెరికా అధ్యక్షుడి పాత్రలు. ఇదే విషయాన్నీ బిన్ లాడెన్ ఆఫ్గాన్ యుద్ధ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి అంటాడు - " వాళ్ళు సినిమాల్లోనే హీరోలు ... నిజజీవితంలో కాదు" అని. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు అమెరికన్లందరికీ ప్రతీక ...త్యాగమూర్తి ... అంటే అమెరికన్లు త్యాగమూర్తులు  అన్నమాట ... ఇక అమెరికన్లకూ పోప్ కు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే . చైనా లోనున్న షిప్పులను చేరుకోవడానికి ప్రముఖులు పడే తపన నిజంగా డార్విన్  ' మనుగడ కోసం పోరాటం ( Struggle For Existence)' ను గుర్తుకుతెస్తుంది . వీళ్ళవే ప్రాణాలా  ?  మిగతావాల్లవి  ప్రాణాలు కాదా ?  అనిపిస్తుంది .. ఈ పోరాటంలో  సామాన్యులు వెనుకబడిపోతారు ... బలవంతులు ( దేశాధినేతలు , వ్యాపారవేత్తలు) Survive  అవుతారు . పనిలోపనిగా జీవ వైవిధ్యం ( Bio - Diversity ) కోసం వీళ్ళంతా తమతోపాటు షిప్పులలో వివిధ జంతువులను ( ఏనుగులు , కుక్కలు, జిరాఫీ మొదలైనవి) తీసుకువెళతారు.కానీ అనుకోకుండా కొంతమంది అతి సామాన్యులకు  షిప్పులో చోటు దొరుకుతుంది. షిప్పులోని ప్రముఖులతో పోల్చితే వీరి సంఖ్య స్వల్పమే. ఈ జీవ వైవిధ్యంలో భారతీయులకు , సామాన్యులకు చోటుండదు ... ఎందుకంటే అప్పటికే భారత దేశం నాశనమైపోతుంది ... చివరికి ఈ ఉపద్రవాన్ని కనిపెట్టిన యువ శాస్త్రవేత్త కుటుంబం కూడా . బహూశా మనుగడ కోసం  పోరాటంలో భారతీయులు , సామాన్య ప్రజానీకం వెనుకబడిపోయారు అనడానికి ఇది సంకేతం కావచ్చు !!?? ... అంటే రెండవ మానవ పరిణామ క్రమంలో ( మనకు తెలిసినంత వరకూ ఇప్పుడున్నది మొదటి మానవ పరిణామ క్రమం )  భారతీయులకు చోటు లేదన్న మాట. ఇది ' Survival Of Fittest ' ను గుర్తుకుతెస్తుంది.
     ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం మొత్తం జలమయం అవుతుంది. చివరికి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ( ప్రస్తుతం దీని ఎత్తు : 8848 మీ. ) కూడా మునిగిపోతుంది ... షిప్పుల్లోని వారంతా బ్రతుకుతారు. కొన్ని రోజులపాటు  ఆ షిప్పులలోనే వీరి  ప్రయాణం  సాగుతుంది ... ఈలోపు ప్రకృతి కొంచెం  శాంతిస్తుంది ... సముద్రాలు వెనక్కు తగ్గుతాయి ... అప్పటికి ఆఫ్రికా ఖండం లోని ఒక పర్వతం ( పేరు గుర్తు లేదు ... బహూశా Ruwenzori పర్వతం కావచ్చు. దీని ప్రస్తుత ఎత్తు :5109 మీ. ) ఎత్తైన ప్రాంతంగా ఆవిర్భవిస్తుంది. ఆ పర్వతం వీరికి ఆవాసంగా మారుతుంది. అంటే అక్కడ నుండి రెండో మానవ పరిణామ క్రమం  ( నిజానికి దీనిని పరిణామం అనకూడదు ... ఎందుకంటే ఇక్కడ మానవుడు పూర్తిగా నాశనం కాలేదు... ఇది మొదటి పరిణామ క్రమానికి కొనసాగింపు )  మొదలవుతుందన్న మాట. ఈ కొత్త జాతిలో అందరూ ఉంటారు ... భారతీయులు తప్ప. విచిత్రమేమిటంటే ... మొదటి మానవ పరిణామ క్రమం కూడా అఫ్రికాలోనే మొదలవ్వడం . ఇక రెండో పరిణామ క్రమంలో ఎంతమంది Survive అయ్యారనేది ఉహాతీతమైనది ...ఎందుకంటే అంతమంది బలవంతుల మధ్య ఈ అతి కొద్ది మంది సామాన్యులు నెగ్గుకురావడం కష్టమే.ఇది Natural Selection కి సంబంధించినది                   

Tuesday, November 24, 2009

Friday, November 20, 2009

Wednesday, November 18, 2009

Monday, November 16, 2009

Friday, November 13, 2009

ఇది మన పని కాదేమో


ఎవరి గోల వారిదే


Thursday, November 12, 2009

Tuesday, November 10, 2009

Monday, November 09, 2009

సోనియా గాంధీ ఈజ్ స్పాన్సర్డ్ బై గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ

వరు చెప్పారో గుర్తు లేదు కానీ ... " నీవు ప్రజలకు సేవ చెయ్యాలంటే రాజకీయాల్లో మాత్రం చేరకు .... నీవు ప్రజలకు చేసే అతి పెద్ద సేవ అదే !!"

ఎవరైనా ఒక రంగంలో విఫలమయ్యారనుకోండి ... మరొక రంగంలో ప్రయత్నిస్తారు ... అక్కడా విఫలమయ్యారనుకోండి .... వేరొక రంగంలో ప్రయత్నిస్తారు .... బ్రతకాలి కదా !? . కానీ రాజకీయ రంగంలో ప్రవేశించినవారు సాధారణంగా విఫలం కావడం అంటూ జరగదు .... సఫలం అయ్యేవరకూ ( ఎమ్మెల్యేనో, ఎంపీనో , మంత్రో అయ్యేవరకూ) అక్కడే ప్రయత్నిస్తూ ఉంటారు ... అదే రాజకీయ మహత్యం. ఒకప్పుడు రాజకీయాల్లో చేరాలన్నా...  రాణించాలన్నా  నాయకత్వ లక్షణాలూ, సేవాభావం, ఉద్యమ నేపధ్యం  అర్హతలుగా ఉండేవి . కాలం మారింది ... కాలంతో పాటూ  అర్హతలూ మారాయి ... అర్హతలతో పాటూ  రాజకీయమూ మారింది. ఇప్పుడు  రాజకీయాల్లో చేరాలంటే ఇవేవీ అవసరం లేదు ... డబ్బు, పలుకుబడి ఉంటే చాలు .... లేదా ఏదైనా రాజకీయ నాయకుడి కొడుకో, మనవడో , దగ్గర బంధువో అయ్యుంటే చాలు .... రాత్రికి రాత్రే నాయకుడై పోవచ్చు .... అంతా ఆ పెద్దాయనే చూసుకుంటాడు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు ... అందుకు తగిన 'గ్రౌండ్ వర్క్' అవసరం. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నది చాలా వరకు స్పాన్సర్డ్ లీడర్లే ( Sponsored Leaders ). వాళ్ళకు ఏ విధమైన అర్హతలూ ఉండవు ... ఉన్నదల్లా ఏదో ఒక నాయకుడికి కొడుకో, బంధువో అయ్యుండడమే. పక్క వాడ్ని అనగదొక్కడమే నాయకత్వలక్షణాలు అనుకుంటారు వీళ్ళు. నాయకత్వం వహించడానికే మేము పుట్టాము(BORN TO LEAD) అన్నట్లుంటుంది వీళ్ళ వరస. పైగా ప్రజలు తమను ఆదరిస్తున్నారని వాదిస్తుంటారు. వీరు తమకున్న ' Brand Name ' తో మిగతా వాళ్ళను తొక్కుకుంటూ ముందుకెళ్ళి పోతుంటారు .... పాపం మిగతా వాళ్ళు ఇవేమీ లేక( అర్హతలూ, నాయకత్వ లక్షణాలూ ఉన్నప్పటికీ) వెనకబడి పోతుంటారు. డిల్లీ నుండి గల్లీ దాకా  వీళ్ళదే హవా.  దారుణం ఏమిటంటే ... ప్రజలు   కూడా ఇటువంటి ' Sponsored Candidates' నే గెలిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది ... నాయకత్వాన్ని బలవంతంగా మనపై రుద్దుతున్నట్లు లేదూ !????. ప్రస్తుతం మనకున్న నాయకుల్లో ఎంతమంది కింది స్థాయి నుండి వచ్చారు ?  ఎంతమందికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ?  ఎంత మందికి సేవాభావం ఉంది ? - అంటే సమాధానం చెప్పడం కష్టం. ' షార్ట్ కట్ ' లో ఎంతమంది నాయకులయ్యారు అంటే  .....  ' చాలామంది' -  అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళను కొంతమందిని చూద్దాం.


సోనియాగాంధీ
స్పాన్సర్డ్ బై : గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ
అర్హతలు: ఇందిరా గాంధీ కోడలు, రాజీవ్ గాంధీ భార్య.
పూర్వానుభవం : ఏమీ లేదు, ఏకా ఎకీన AICC అధ్యక్షురాలు అయిపోయారు.


రాహుల్ గాంధీ 
స్పాన్సర్డ్ బై : గాంధీ - నెహ్రూ ఫ్యామిలీ
అర్హతలు : నెహ్రూ - ఇందిరల మనుమడు, రాజీవ్ గాంధీ కొడుకు
పూర్వానుభవం : ఏమీలేదు, గత ఐదున్నరేల్లనుండి ఏం.పి, ఈ మధ్యే  AICC కార్యదర్శిగా నియమింపబడ్డారు (అదీ డైరెక్టుగా.. )


నవీన్ పట్నాయక్
స్పాన్సర్డ్ బై : బిజూ పట్నాయక్ ఫ్యామిలీ 
అర్హతలు: స్వర్గీయ బిజూ పట్నాయక్ తనయుడు  
పూర్వానుభవం : ఏమీ లేదు, తండ్రి మరణానంతరం ఒడిస్సా లో అడుగుపెట్టారు.అంతవరకూ విదేశాల్లో గడిపారు. 



హెచ్.డి.కుమార స్వామి
స్పాన్సర్డ్ బై : దేవేగౌడ
అర్హతలు: మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ
పూర్వానుభవం: ఏమీలేదు ... కాకపోతే ముఖ్యమంత్రి కాకముందు ఆయన సుప్రసిద్ధ కన్నడ సినీ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్త్రిబ్యూటార్.      



జగన్మోహన రెడ్డి
స్పాన్సర్డ్ బై : వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
అర్హతలు : దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఏకైక ముద్దుల తనయుడు
పూర్వానుభవం : ఏమీ లేదు,గత ఐదు నెలలుగా ఏం.పి.ఈయన తండ్రి ఏవో కొన్ని పనులు పూర్తిచేయకుండా వెళ్ళిపోయారంట... అవి నేను తప్ప ఇంకెవరూ చేయలేరు...చేయకూడదు ... అందుకే నన్ను సి.ఎం చేయండి అంటున్నాడు ఈయనగారు .           

ఇక రాష్ట్రం నుండి గల్లీ స్థాయి వరకూ ఇలాంటి వాళ్ళకు లెక్కేలేదు. ఇలాంటి మరికొంతమంది గురించి మరోసారి .

Sunday, November 08, 2009

దీని సిగ దరగ ... ఎంత నడిచినా తరిగి చావడం లేదు !!!

 
ఒరేయ్ శీను నున్ను దీంట్లో బంధించి ... నా మీద డైలాగులు వేస్తావా ? ఒక్క సారి నాకు దొరుకు పరపర లాడించేస్తాను. 

Friday, November 06, 2009

వదల బొమ్మాలీ ... నిన్నొదల


సోనియా కు దగ్గరయ్యేందుకే ....



పోగొట్టుకున్నచోటే  వెదకమంటారు మన పెద్దవాళ్ళు . గాలి బ్రదర్స్ ఈ సామెతను బాగా ఒంటబట్టించుకున్నారు ...అందుకే ఎడ్డియూరప్పను దించే వరకు' గాలి' కూడా పీల్చేదిలేదంటూ  భీష్మించ్చుకూచున్నారు. కర్ణాటక, ఆంధ్రాలను ఏలేద్ధామని  ' గాలిమేడలు ' కట్టుకున్న బ్రదర్స్ కు  ' పెద్ద బాసు' మరణించడంతో ' ఎదురుగాలి ' వీయడం మొదలెట్టింది. ఏంటి ... మోకాలికీ( ఆంధ్రా) , బోడిగుండుకీ ( కర్ణాటక ) లంకె పెడుతున్నాను అనుకుంటున్నారా? ... నేను పెట్టడమేన్టండి బాబూ ... గాలి బ్రదర్సే  ఆ లంకె పెట్టుకున్నారు. గాలి బ్రదర్స్ కర్ణాటకలో బి.జె.పి  వీరాభిమానులు. సహజంగానే అక్కడ బి.జె.పి ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు. వారి ధాటికి అక్కడ కాంగ్రెస్ బాగా దెబ్బతింది ... దాంతో మేడం కి బాగా కోపమొచ్చింది ... కానీ ఏం చేస్తుంది .... మధ్యలో పెద్ద బాసు అడ్డంపడ్డాడు. మేడం సమయం కోసం  కాచుకుంది. ఆ సమయం రానే వచ్చింది .... పెద్ద బాసు కాలం చేసాడు .... చిన్న బాసు తెర మీదకొచ్చాడు ... కాదు కాదు తెర మీదకు తీసుకొచ్చారు. ఇంకేముంది మేడం కి పట్టు దొరికింది. చిన్న బాసుని పిలిపించి మాట్లాడింది. ముందు  నువ్వు' కర్నాటకం' సంగతి చూడు .... ఆ తరువాత నేను నీ సంగతి ( సి.ఎం) చూస్తాను అంది. ఇంకేముంది  కర్ణాటకలో ' జగన్నాటకానికి'  తెర లేచింది ... ఈ నాటకానికి ' గాలి' తోడయ్యింది .... అగ్గి రాజుకుంది. అక్కడ కేంద్రంలో కనుచూపు మేరలో బి.జె.పి  బ్రతికి బట్టకట్టే స్థితిలో లేదు ... ఇక్కడ  ఎడ్డియూరప్ప తో విసిగిపోయిన బళ్ళారి బ్రదర్స్ అలోశించి తమ' గాలి' ని కాంగ్రెస్ వైపు మళ్ళించారు. ఈ నాటకంలో చిన్నబాసు లాభ పడినా ... కాకున్నా' గాలి'  కి ఎదురులేదు. ఎందుకంటే ఎడ్డియూరప్ప  ఖర్మ కాలి అక్కడ ప్రభుత్వం మారితే మేడం మనసు కరుగుతుంది ... ఆపై ' గాలి ' పంట పండుతుంది. ఇంకేముంది కేంద్రం, రెండు రాష్ట్ర ప్రభుత్వాల అండతో కర్ణాటక, ఆంధ్రాలను టన్నులకొద్దీ తవ్వి  ... తవ్వి  పారేయొచ్చు. ఒకవేళ ఎద్దియూరప్ప ఖర్మ యదావిధిగా ఉంటే మరీ మంచిది ... పాత బాసే కదా మొహమాటం ఏముంటుంది ... మళ్ళీ టన్నుల కొద్దీ తవ్వుకోవచ్చు. వస్తే కొండ ... పోతే వెంట్రుక.అంతటితో'గాలి' అదృష్టం కంచికి .... మన దురదృష్టం ఇంటికి.     
కూడలి
మాలిక: Telugu Blogs