Thursday, October 29, 2009

తెలంగాణా వచ్చుడూ లేదు ... కే.సి.ఆర్ సచ్చుడూ లేదు




గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగింది .... రాజకీయనాయకులంతా కలుగుల్లో ఎలుకల్లా బైటపడి సందడి చేస్తున్నారు. పాత ఆయుధాలను పక్కన పడేసి కొత్త ఆయుధాలకోసం వెతికేవారు కొందరైతే .... పాత ఆయుధలకే పదును పెట్టేవాళ్ళు మరికొందరు ... అసలు ఆయుధమే లేని  వాళ్ళు ఏదో ఒక       ఆయుధం  దొరక్కపోతుందా  అని చిన్ని  ఆశ. ఎవరు ఏం చెసినా  రాజధాని నగరాన్ని చేజిక్కిన్చుకోవడానికే!. ఇందుకు ప్రధాన పార్టీలన్నీ తమ తమ వ్యూహ, ప్రతివ్యుహాలతో ఎప్పుడో సిద్దమైపోయాయి. అందుకు ఆయుధాలు కూడా సిద్దం చేసుకున్నారు. పాలక పక్షం కాంగ్రెస్ తన అధికారబలంతో  ముందుకుపోతుంటే .... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తన పాత ఆయుధమైన 'హైటెక్ సిటీ - క్లీన్& గ్రీన్ - అభివృద్ధి' తో ముందుకుపోతుంది . ఇక టి.ఆర్.ఎస్ తన పాత ఆయుధాన్ని వదిలి కొత్త ఆయుధానికి  ( హైదరాబాద్ : ఫ్రీ జోన్ అంశం )  పదును పెడుతుంది. సందట్లో .... సడేమియా అన్నట్లు ప్రజారాజ్యం పార్టీ ఏ ఆయుధమూ లేక .... అసలు ఎలా పోరాడాలో తెలీక కొట్టుమిట్టాడుతుంది. కమలనాధులైతే తమతో ఎవరైనా కలవకపోతారా - అని పొత్తు కోసం ఎదురు చూస్తూనే .... " మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము" అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కమ్యునిస్టులు ఎలాగూ  .... ఆటలో అరటిపండులే!. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గత పక్షం రోజులుగా కే.సి. ఆర్ చాలా సందడి చేస్తున్నారు. గ్రేటర్ సందడంతా  ఆయన మొహంలోనే కనిపిస్తుంది .... అందుకు ఆయన చేయని జిమ్మిక్కులు లేవు. పాత్రికేయులను పిలిచి ముచ్చట్లు పెట్టడం,ఎదుటివారిని బండ బూతులు తిట్టడం, ఫ్రీ - జోన్ అంశం కెలకడం అన్నీ గ్రేటర్ కోసమే. ఈ సందర్భంగా  " తెలంగాణ వచ్చుడో .... కే.సి.ఆర్ సచ్చుడో "-  అని  కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు.  తెలంగాణా అంశాన్ని కే.సి.ఆరే గాకుండా సమైఖ్యవాదులు కూడా రాజకీయం చేసేస్తున్నారు. ఈ విషయంలో కే.సి.ఆర్ తెలంగాణా ప్రజలను మోసం చేస్తుండగా సమైఖ్యవాదులు 'ఆంధ్రోల్లను'  కాష్  చేసుకుంటున్నారు. ఈ పోరాటంలో గెలిచేది ఎవరైనా ...... ఓడేది మాత్రం ప్రజలే( తెలంగాణా, ఆంధ్రా జనం కలిపి) !.                       

కాంగ్రెస్, జె.డి.ఎస్ లు గోడ మీద పిల్లులు

Wednesday, October 28, 2009

సోనియా ప్రధాని పదవి చేపట్టకపోవడం త్యాగమా? లేక వ్యూహమా ?



2004 సార్వత్రిక ఎన్నికలలో U.P.A  విజయం సాధించింది. సహజంగానే అందరూ సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడతారని భావించారు.కానీ అప్పుడే మొదలయ్యింది రాజకీయ అంతర్నాటకం. రాజకీయులు రెండు వర్గాలుగా చీలి పోయారు. మొదటి వర్గం(కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు)  సోనియా ప్రధాని పదవి చేపట్టాలనీ .... రెండో వర్గం ( బి.జె.పి  తదితర పార్టీలు ) ఆమె ఆ పదవిని చేపడితే గొడవలైపోతాయని. చివరికి తర్జన భర్జనలనంతరం ఆమె ఆ పదవిని చేపట్టడానికి నిరాకరించారు. మొదటి వర్గం ఆమెను త్యాగశీలిగా అభివర్నించేసి అమాంతం ఆకాసానికేత్తేయగా .... రెండో వర్గం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. 2009 లో కూడా మొదటి వర్గం అదే సీను రిపీట్ చేసింది .... కాకపోతే మోతాదు చాలా తక్కువ. ఇంతకూ మేడం ఆ పదవి స్వీకరించకపోడానికి కారణం ఏమిటి? .... కారణం వెరీ సింపుల్ .... వ్యూహం. అవును భారత రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఆమాత్రం వ్యూహం అవసరమే ( కాంగ్రెస్ వాదులు దీనిని వ్యూహం అంటే ఒప్పుకోరు .... దానిని త్యగామనాలంటారు .... మనకేంటి దురద ). లేకపోతే ప్రధాని పదవి నిరాకరించే తింగరి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు. మీరు .... నేను అయితే ఆ పని చేస్తామా? .... ఖచ్చితంగా చెయ్యం .... అంతకు మించిన ప్రతిఫలం వస్తే తప్ప.

వ్యూహం వెనుక కారణాలు : 

 1. తన  కుటుంబ శత్రువు ఐన LTTE ని, పెద్దపులిని అంతమొందించడం.  
         - ఆ పని పదవిలో వుండగా చేస్తే సోనియా కు చెడ్డపేరు వచ్చేది ... వ్యక్తిగత కక్షలకు పోయి ఆ పని చేసారని విమర్శలు వచ్చేవి. 
2. పార్టీ, దేశ రాజకీయాల్లో తన స్థానం పదిలపరచుకోవడం .
          - ప్రస్తుతం పార్టీ, దేశ రాజకీయాల్లో సోనియా పరిస్థితి పదిలమే కదా !?
3. తన రాజకీయ శత్రువులపై  పైచేయి  సాధించడం.
          - ఆపని తను పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండే మొదలుపెట్టారు . ప్రస్తుతం పార్టీలో సోనియా కి ఎదురులేదు .... పార్టీలో అందరూ గాంధీ .. నెహ్రూ విదేయులే .
4. తనయుడు రాహుల్ ని భావి ప్రధాని ని చేయడానికి కావలసిన వాతావరణం సృష్టించడం.
           - ఆ పని మీదే రాహుల్ ని ఎం.పి చేయడం ...   ఆపై దేశ పర్యటన చేయించడం.     
5. మన్మోహన్ సింగ్ లాంటి మేధావి, నిజాయితీపరున్ని ప్రధాని చేసానన్న ఖ్యాతినార్జించడం.
         - గతంలో పి.వి. నరసింహరావు ని ప్రధానిని చేసి చేతులు కాల్చుకున్న సోనియా ... మళ్ళీ ఆ పని చేయకూడదని, నమ్మిన భంటు మన్మోహన్ ని ప్రధాని ని చేసారు.   
6. త్యాగశీలిగా చరిత్రలో నిలిచిపోవడం.
         - త్యాగశీలిగా సోనియా ను 'ప్రమోట్' చేయడం  కాంగ్రెస్ వాదులు ఎప్పుడో మొదలుపెట్టారు. 


                  ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో చూసారా !? _________________________________________________

ఈ బ్లాగు యొక్క ఆహార్యం, రచనల శైలి పై అభిప్రాయాలను పంపవలసిన చిరునామా:  msrinivasu275@gmail.com


Sunday, October 25, 2009

బ్లాగింగు చేయరా డింభకా !

తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం.
తెలుగులో బ్లాగింగు రోజురోజుకీ ప్రవర్ధమానమవుతుంది ... చాలా సంతోషం. రచయితలే గాకుండా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు బ్లాగింగు చేస్తున్నారు. 2005 లో మొదలైన  బ్లాగింగు ప్రక్రియ ఇంటర్నెట్ వినియోగంతో ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తుంది. పూర్వం రచయితలు, ఔత్సాహికులు తమ అభిప్రాయాలను, రచనలను దినపత్రికలలోను, వారపత్రికలలోను, మాసపత్రికలలోను ప్రచురించేవారు. ఇందుకు వారు చాలా శ్రమపడేవారు. పేపర్లలో తమ పేరు, రచనలను చూసుకుని మురిసిపోయేవారు. వాటి ప్రచురణలకు పత్రికాఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగేవారు. పత్రికాధిపతులకు నచ్చితే వాటిని ప్రచురించే వారు ... లేకపోతే లేదు. బ్లాగింగు పుణ్యమాని ఆ బాధ తప్పింది. ఇప్పుడు అందరూ తమ అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించగలుగుచున్నారు.ఇవి ఏ పత్రికాధిపతికీ నచనక్కరలేదు.రాసిన వారికీ చుసినవారికీ నచ్చితే చాలు. ఇక్కడ పత్రికాయాజమన్యాలకు వంత పాడే ఎడిటర్లు,రిపోర్టర్లు ఉండరు .... ఎవరికి వారే పత్రికా(బ్లాగు)యజమానులు. బ్లాగింగు వర్ధిల్లాలి .... బ్లాగర్లూ వర్ధిల్లాలి.
    

Saturday, October 24, 2009

Friday, October 23, 2009

Wednesday, October 21, 2009

Tuesday, October 20, 2009

రాజకీయాల్లో సినిమా స్టార్లు


రోనాల్డ్ రీగన్: అమెరికా, రష్యాల మధ్య ప్రచ్చన్న యుద్ధం(COLD WAR)  కాలంలో అమెరికా అధ్యక్షుడిగా  రెండు సార్లు(1981 - 89 ) పనిచేసారు. అప్పట్లో  భారత్ - అమెరికా ల మధ్య పెద్దగా సంబంధాలుండేవి కాదు. దానికి కారణం భారత్ రష్యాను సమర్ధించడమే. అంతకు ముందు  కాలిఫోర్నియా  గవర్నర్ గా పనిచేసారు. ఈయన ఇద్దరు భార్యలు  జేన్ విమెన్ , నాన్సీ డేవిస్ లు కూడా నటులే.  ఈయన  మొదటి  సినిమా ' లవ్  ఈస్  ఆన్  ది  ఎయిర్ '.  థిస్ ఇస్ ది ఆర్మీ, డార్క్ విక్టరీ , ది కిల్లర్స్ మొదలైన సినిమాలలో నటించారు.  2004, జూన్ 5 న అల్జీమర్స్ వ్యాధితో మరణించారు.
__________________________________________________________ 





జోసఫ్ ఎస్ట్రడా: ఫిలిప్పీన్స్ సూపర్ స్టార్, దాదాపు 100 సినిమాలలో నటించారు. సినిమా గ్లామరు తో ఫిలిప్పీన్స్ 13 వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన అవినీతి పాలన కారణంగా పదవి నుండి తొలగింపబడ్డారు. అధ్యక్షుడు కాక  ముందు సాన్ - జాన్ నగర మేయర్ గాను, సెనేటర్ గాను, ఆ తరువాత ఫిలిప్పీన్స్  ఉపాధ్యక్షుడిగానూ పనిచేసారు. ఈయన తరువాత  గ్లోరియో ఆరియో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈమె బిల్ క్లింటన్ క్లాస్మేటు
 ____________________________________________________________

ఆర్నాల్డ్  స్క్వార్జ్ నెగ్గెర్ : ఆస్ట్రియాలో పుట్టిన ఆర్నాల్డ్ అమెరికాకు వలసవచ్చాడు. సినిమాలనుండి రాజకీయాలలోకి వచ్చిన ఈ 'బాడీ బిల్డర్' TERMINATOR  సీరీస్ చిత్రాల ద్వారా భారతీయులకు కూడా  పరిచయమే. ప్రస్తుతం  కాలిఫోర్నియా గవర్నర్ గా ఉన్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో  రిపబ్లికన్  పార్టీ  తరపున పోటీ చేస్తానని, అది కుదరకపోతే (అమెరికా లో పుట్టని వ్యక్తులు అధ్యక్ష పదవికి అనర్హులు) తన స్వంత దేశమైన ఆస్ట్రియా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. టోటల్ రీ కాల్, ప్రిడేటర్, టెర్మినేటర్ - 1, 2, 3, ట్రు లైస్,బెట్మేన్  అండ్ రాబిన్, ఎరేజర్  మొదలైన చిత్రాలలో నటించారు. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.    
__________________________________________________________________


విజయ కుమారతుంగ: శ్రీలంక సూపర్ స్టార్. 114 సినిమాలలో  నటించారు. నంగురన్ అనే తమిళ సినిమాలో కూడా నటించారు. ఏ పదవి  చేపట్టనప్పటికీ శ్రీలంకన్ మహాజన్ పార్టీ ని స్థాపించి రాజకీయాలలో చురుగ్గా వుండేవారు. శ్రీలంక ప్రధానిగా పోటీ చెయాలని భావించారు. ఈలోపు  దురదృష్టకర రీతిలో హత్య చేయబడ్డారు. శ్రీలంక రాజకీయ కుటుంబానికి చెందిన సిరిమవో  బండారునయకే  కూతురు చంద్రిక ను వివాహమాడారు. ఈయన భార్య చంద్రిక కుమారతుంగ గతంలో  శ్రీలంక ప్రధానమంత్రి,  అధ్యక్షరాలిగా ఉన్నారు.
__________________________________________________________________


క్లింట్ ఈస్ట్ వుడ్హాలీవుడ్  నటుడుగతంలో కార్మెల్ పట్టణ మేయర్ గా రిపబ్లికన్ పార్టీ తరపున పనిచేసారు. కౌ బాయ్ సినిమాలనగానే క్లింట్ ఈస్ట్ వుడ్ గుర్తుకొస్తాడు. 'వేర్ ఈగల్స్ డేర్' సినిమాలో నటించినందుకు అప్పట్లోనే (1968 లో )  8 లక్షల అమెరికన్ డాలర్లను పారితోషికంగా తీసుకోవడం ఒక రికార్డ్.  'మిలియన్ డాలర్ బేబి' సినిమాకు  బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్  అందుకున్నారు.

__________________________________________________________________




మహేంద్ర రాజపక్సే: ప్రస్తుత శ్రీలంక అధ్యక్షులు. అంతకుముందు ప్రధానమంత్రిగా పనిచేసారు.  శ్రీలంకలో మరో రాజకీయ కుటుంబానికి చెందిన రాజపక్సేరాజకీయాలలోకి రాకముందు సినిమాలలో నటించారు. తండ్రి మరణాంతరం రాజకీయల్లోకొచ్చారు. ________________________________________________________________


కరుణానిధి: ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి గా ఉన్నారు. గతంలో నాటక రచయితగానూ, సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగానూ పనిచేసారు. దాదాపు 70 సినిమాలకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. అందులో తన రాజకీయ ప్రత్యర్దులైన ఎం.జి. ఆర్ , జయలలిత సినిమాలు కూడా ఉండటం విశేషం. ఈమధ్యనే( 2005 లో )  మీనా నటించిన కన్నమ్మ అనే తమిళ సినిమాకు స్క్రీన్ ప్లే , డైలాగులు సమకూర్చారు.
__________________________________________________________________

ఎం.జి.రామచంద్రన్: తమిళుల ఆరాధ్యుడు. భారత దేశంలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి సినిమా నటుడు. ఈయన నటించిన రాజకుమారి సినిమాకు రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి మాటలు రాయడం విశేషం. అప్పట్లో ఇద్దరు మంచి మిత్రులు. ఆ తరువాత స్వంతంగా పార్టీ (AIADMK) స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో జనరంజక పధకాలను ప్రవేశపెట్టి తమిళుల హృదయాలలో నిలిచిపోయాడు. బడి పిల్లలకు  మధ్యాహ్న  భోజన పధకం ఈయన సృష్టే . ఈయన్ను ఆదర్శంగా తీసుకుని  ఆ తరువాత ఎంతోమంది సినిమా నటులు రాజకీయల్లోకొచ్చారు. సహ నటుడు మోహన్ రాధా ( నటి రాధిక తండ్రి) రివాల్వర్ తో కాల్పులు జరపగా  మెడలో బుల్లెట్ దూసుకుపోయింది. ఇదంతా ప్రత్యర్థి కరుణానిధి కుట్ర అని అప్పట్లో  అనుమానించారు. కిడ్నీ వ్యాధితో మరణించారు.
__________________________________________________________________


ఎన్.టి రామారావు: ఆంధ్రుల ఆరాధ్య దైవం. తెలుగు సినీ పరిశ్రమలో నాటికీ నేటికీ రారాజు. ఇండియాలో అతున్నత పదవి చేపట్టిన రెండో సినీ నటుడు. తెలుగుదశం పార్టీ స్థాపించి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఒక రికార్డ్. ఎం.జి.ఆర్ , ఎన్.టి.ఆర్ లు సమకాలీనులు. ఎం.జి.ఆర్ లానే ఎన్.టి.ఆర్ పై కూడా హత్యాయత్నం జరిగింది. మల్లెల బాబ్జీ అనే వ్యక్తి కత్తితో దాడి చేసాడు. రాముడు, కృష్ణుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్.టి.ఆరే. 2 రూపాయలకు కిలో బియ్యం, జనత వస్త్రాలు  మొదలైనవి ఈయన పధకాలు. పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు( మాండలిక వ్యవస్థ, పటేలు, పట్వారీ వ్యవస్థ రద్దు,ప్రజల వద్దకు పాలన ) తీసుకువచ్చిన ఘనత ఈయనదే.
_________________________________________________________________
_
జయలలిత: ఎం.జి.ఆర్ మరణం తరువాత రాజకీయల్లోకొచ్చిన జయ పూర్వ రంగంలో ఆయనతో కలిసి నటించారు. ఆయన స్థాపించిన పార్టీ (AIADMK) తరపునే ముఖ్యమంత్రి అయ్యారు. ఎం.జి.ఆర్, జయలలితలది హిట్ పెయిర్. ప్రస్తుతం అదే పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు.
 _________________________________________________________________


 
జానకీ రామచంద్రన్: ఎం.జి.ఆర్ భార్య, ఆయన సహ నటి. ఆయన మరణం తరువాత నెలరోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు.


__________________________________________________________________


విజయకాంత్: అసలు పేరు విజయరాజ్ అలగిరిస్వామి నాయుడు. తమిళనాడులో అందరు కెప్టెన్ అంటారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.  ఆంద్ర, కేరళలో కూడా అభిమానులున్నారు. కెప్టెన్ ప్రభాకర్, పోలీస్ అధికారి, వనతి పోల్ ( మా అన్నయ్య - రాజశేఖర్ ), రమణ( టాగూర్ - చిరంజీవి ), చిన  గౌందర్ ( చిన రాయుడు - వెంకటేష్) , సిందూర పువ్వు మొదలైన సినిమాలలో నటించారు. DMDK పార్టీ  స్థాపించి గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రమంతా పోటీ చేసారు , అయితే ఆయనొక్కడే  ( విరుదాచలం నుండి)  గెలిచాడు. ఈయన్ పార్టీ చీల్చిన ఓట్ల వలన AIADMK  పార్టీ  నష్ట పోయినట్లు  రాజకీయ విశ్లేషకుల అంచనా.
__________________________________________________________________


చిరంజీవి: మెగాస్టార్ గా అభిమానులకు పరిచయం. తన డాన్సులు, ఫైటింగులతో ప్రేక్షకులకు దగ్గరై వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన నటించిన ఖైదీ తెలుగు సినీ రంగంలో ఒక 'ట్రెండ్ సెట్టర్'. అందరివాడు కావాలనుకున్నారు .... కానీ రాజకీయాల్లో ప్రవేశించి కొందరివాడయ్యాడు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాష్ట్రమంతా పోటీ చేసారు. కానీ ప్రజలు తిరస్కరించారు.  ఈయన పార్టీ చీల్చిన ఓట్ల వలన తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసింది.వీళ్ళేగాకుండా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్ర రంగాలకి చెందిన ఎంతోమంది నటులు రాజకీయాల్లో ఉన్నారు.

రాజకీయాల్లో ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న నటులు : రజనీకాంత్, విల్ స్మిత్, బ్రాడ్ పిట్ 

                      విల్ స్మిత్             బ్రాడ్ పిట్                   రజనీకాంత్    
రజనీకాంత్: తమిళ సూపర్ స్టార్. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటున్నారు.
విల్ స్మిత్: హాలీవుడ్ సూపర్ స్టార్.15 సంవత్సరాలు ప్రణాళికాబద్దంగా శ్రమిస్తే అమెరికా అధ్యక్షుడినవుతానంటున్నారు
బ్రాడ్ పిట్: హాలీవుడ్ సూపర్ స్టార్, త్వరలో డెమాక్రటిక్ పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నారు.

Saturday, October 17, 2009

భారత రాజకీయాల్లో బ్రహ్మచారులు


భీష్ముడు, అటల్ బీహారి వాజపాయ్, అబ్దుల్ కలామ్, మాయావతి, జయలలిత, మమత బెనర్జీ, ఉమాభారతి, నరేంద్ర మోడి, నవీన్ పట్నాయక్, రాహుల్ గాంధీ ..... పరిచయం అవసరంలేని వ్యక్తులు, వీళ్ళందరికీ కొన్ని పోలికలున్నాయి. వీళ్ళంతా భారత రాజకీయాలలో చాలా ఉన్నత స్థాయి వ్యక్తులు.... అంతే కాదండి వీల్లెవారు పెళ్లి చేసుకోలేదు - బ్రహ్మచారులు.      



భీష్ముడు: పురాణ కాలానికి చెందిన భీష్ముడు బహూశా  భారత రాజకీయాలలో మొట్ట మొదటి బాచిలర్ కావచ్చు. ప్రతిజ్ఞా బద్దుడై చివరికంటూ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.





అటల్ బిహారీ వాజపాయి :   ప్రస్తుత కాలానికి చెందిన వాజపాయీ పెళ్లి  చేసుకోలేదు . ఈయనకు ఇద్దరు దత్త పుత్రికలు. ఈయన భారతదేశ మొదటి బ్రహ్మచారి ప్రధానమంత్రి.


అబ్దుల్ కలామ్: తన జీవితమంతా శాస్త్ర,సాంకేతిక పరిశోధనలకే పరిమితం చేసిన ఈ 'మిస్సైల్ మేన్' ఎందుకో మరి పెళ్లి చేసుకోలేదు. బహూశా  ... పరిశోధనలలో మునిగి పెళ్లి విషయం మర్చిపోయి ఉండవచ్చు.




జయలలిత:ఎం.జి.ఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకొచ్చిన జయ పెళ్లి చేసుకోలేదు. సహ నటులు ఎం.జి.ఆర్,శోభన్ బాబు లతో సంబంధాలున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చేవి.జయ జీవితం ఆది నుండీ వివాదాస్పదమే."నేను ఈమెను కుమారి అని పిలవాలా? లేక శ్రీమతి అని పిలవాలా?" - అని కరుణానిది జనాన్నిఅడుగుతున్నారు.

మమత బెనర్జీ : ఈమె రాజకీయ జీవితమంతా పోరాటాలమయం. ఈమె కూడా పెళ్ళికి దూరంగానే ఉన్నారు.కమ్యునిస్టులపై ఒంటి కాలిపై లేస్తుంటారు.  



మాయావతి: ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
ఘజియాబాద్(యు.పి) లో పుట్టిన ఈ బెహన్(సోదరి) కూడా పెళ్లి చేసుకోలేదు.భారత మొదటి దళిత ప్రధాని నేనే అవుతానని ప్రకటించారు.



ఉమాభారతి: మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బి.జె.పి సన్యాసిని. సోనియా ప్రధాని అయితే గుండు చేయించుకున్టానని ప్రకటించారు. 'ఫైర్ బ్రాండ్' అని పేరు. అద్వానీపై కత్తిగట్టి బి.జె.పి నుండి బైటకొచ్చారు.

నరేంద్ర  మోడి :ఈయన  గుజరాత్ ముఖ్యమంత్రి . RSS రాజకీయాలలో పుట్టిపెరిగిన మోడి పెళ్లి చేసుకోలేదు.భారత దేశంలో  తీవ్రవాదం అంతానికి మోడి తరహా విధానం మేలని చాలమంది అభిప్రాయం. చాలామంది దీనితో ఏకీభవించరు.


నవీన్ పట్నాయక్ :  ఒరిస్సా ముఖ్యమంత్రి. ఈయన జీవితంలో అధిక భాగం విదేశాల్లోనే గడిచిపోయింది. తండ్రి బిజు పట్నాయక్ మరణాంతరం ఒరిస్సా లో అడుగుపెట్టారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.



రాహుల్ గాంధీ : ఇంకా పెళ్లి కాలేదు. వయస్సు 39 సం. ఇండియాలో 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్'. అదృష్టవంతులు ఎవరైనా(అమ్మాయిలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.'బెస్ట్ ఆఫ్ లక్'.



            ఈ-మెయిల్: msrinivasu275@gmail.com 

Friday, October 16, 2009

కుళ్ళు రాజకీయాలు .... మంచి రాజకీయాలు విడిగా వుంటాయా?

   మొన్నీమధ్య నేను  ' బావార్చి'  లో హైదరాబాద్  బిర్యాని  తింటుంటే  పాత  మిత్రుడు  కలిసాడు. వాడు నాకు ఇంజనీరింగ్ లో క్లాస్మేటు. ఇద్దరం బిర్యాని తింటూ పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఆ తరువాత టాపిక్ రాజకీయాలవైపు మళ్ళించాను. వాడికి రాజకీయాలంటే బొత్తిగా ఆసక్తి లేదు. క్రికెట్ ఉంటే బతికేస్తాడు. " Eat cricket, sleep cricket  టైపు ". ఆ విషయం తెలిసీ .... ఉండబట్టలేక జగన్ సి.ఎం అవుతాడంటావా ? -  అని అడిగాను. దానికి వాడు " ఈ కుళ్ళు రాజకీయాల గొడవ మనకెందుకు మామా? శుభ్రంగా బిర్యాని తిను " అన్నాడు." ఈ మధ్య ప్రతీవాడికీ  కుళ్ళు రాజకీయాలు  అనడం ఫ్యాషన్ అయిపోయింది "  అన్నాను. దానికి వాడు కొంచెం ఫీలయ్యి " జగన్ సి. ఎం అయితే మనకేమొస్తుంది .... కాకపోతే మనదేంపోతుంది"? అన్నాడు. అందరి జీవితాలను ఎంతోకొంత ప్రభావితం చేసేవి రాజకీయాలే కదా - వాటిని తెలుసుకోపోతే ఎలా? అన్నాను. "మంచి రాజకీయాలైతే తెలుసుకోవచ్చు, కుళ్ళు రాజకీయాలను తెలుసుకుని ఏం చేస్తాం"? అన్నాడు.  ఈలోపు బిర్యాని తినడం పూర్తవడంతో ఎవడి దారిన వాడు వెళ్ళిపోయాం. ఈమధ్య ఎవడ్ని కదిలించినా ఈ కుళ్ళు రాజకీయాలు మాకెందుకు అనేవాడే!. ఒక్కడు కూడా రాజకీయాల్లోకొచ్చి ఈ కుళ్ళును కడిగేస్తాం  అనడం లేదు. జరిగేవన్నీ మంచి రాజకీయాలైతే  ఎవడైనా రాజకీయాల్లోకొస్తాడు. కుళ్ళు రాజకీయాల్లో ప్రవేశించి ... ఆ కుళ్ళును కడిగేయడమే అసలు సిసలు రాజకీయం. ఇంతకీ రాజకీయాలు మంచివా?  లేక చెడ్డవా?. మంచి రాజకీయాలు - కుళ్ళు రాజకీయాలు అని విడిగా  ఉంటాయా?  రాజుల కాలం నుండీ ఈ చర్చ సాగుతూనే వుంది.

      రాజకీయాలు మంచివా - చెడ్డవా ?  అనేది వ్యక్తులను బట్టి వుంటుంది. మంచివాళ్ళు చేస్తే అవి సమాజానికి మేలు చేస్తాయి - చెడ్డవాళ్ళు చేస్తే కీడును కలిగిస్తాయి. రాజకీయాలు ప్రజా శ్రేయస్సు కోసం. కేవలం ప్రజాప్రయోజనమే రాజకీయ ప్రక్రియ పరమోద్దేశ్యం.అది వ్యక్తిగత  ప్రయోజనం చేకుర్చేదిగా వుండకూడదు - సమాజానికంతటికీ ప్రయోజనం చేకూర్చాలి. శ్రీరాముడు వాలిని చెట్టుచాటునుండి చంపాడు - ఇది ఏ తరహా రాజకీయం? దానివల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది - శ్రీరాముడికా? సుగ్రీవుడికా? లేక వానర జాతికా ?



 
మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసినది ఏ రాజకీయం ? ఆయన అలా ఎందుకు చేసాడు? దుష్టులను శిక్షించి - శిష్టులను రక్షించడానికేనా ? లేక పాండవులకు రాజ్యం కట్టబెట్టడానికా?. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డంపెట్టుకుని భీష్మున్ని చంపడం మంచి రాజకీయమేనా?. తనను అవమానించిన కౌరవులను నాశనం చేయడానికి శకునిమామ ఆడిన ' మాయాజూదం' - మంచిదా? చెడ్డదా?. భారతస్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ చేసిన రాజకీయం ఎలాంటిది? దేశభక్తులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరిశిక్ష  నుండి  రక్షించగలిగే స్థితిలో ఉండి కూడా గాంధీజీ ఆ పని చేయలేదు - అది ఏ రాజకీయం? . తెలుగుదేశం పార్టీలో సంభవించిన "ఆగస్టు సంక్షోభాలు" ఎలాంటి రాజకీయాలకు సంకేతం?.

      రాజకీయాలు అగ్గి లాంటివి .... అగ్గిని వంట చేయడానికీ ఉపయోగించొచ్చు-  కొంపలు తగలెట్టడానికీ ఉపయోగించొచ్చు. కాకపోతే దాన్ని ప్రయోగించిన పరమార్ధమే తేడా. రాజకీయాలు తస్మదీయులకు ప్రయోజనాన్ని- అస్మదీయులకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఉదాహరణ కీ.శే. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి. ఆయన తనను నమ్ముకున్న వాళ్ళకోసం ఎంతకైనా తెగించే టైపు - తనను వ్యతిరేకించే వాళ్ళను తుంచేసే టైపు. ఇక్కడ నమ్ముకున్నవాళ్ళు అంటే ప్రజలు మాత్రం కాదండోయ్ .... వందిమాగధులు. రాజకీయాల్లో సమాజ శ్రేయస్సు ఇమిడి ఉండాలి. అప్పుడే అవి మంచి రాజకీయాలౌతాయి. రాజకీయాలు సమాజం కోసం - వ్యక్తుల కోసం కాదు. పూర్వం రాజకీయాలు రాజులకే పరిమితమైన ఆట. తరువాత సంస్థానాధీశులు, జమిందార్లు రాజకీయాలు చేసారు. ఆ తరువాత డబ్బున్నవాళ్ళు చేసారు, ఇప్పుడు సామాన్యుడి వంతు - ఈ మధ్యలో సినిమావాళ్ళు కూడా రాజకీయాలు చేసారు.ఎవడు రాజకీయం చెసినా గాని దాని పరమార్ధం మాత్రం  నెరవేరడం లేదు - ఇదేనా  రాజకీయం అంటే !?.                                                                  

                              -శీను
      ఈ-మెయిల్: msrinivasu275@gmail.com 

Sunday, October 11, 2009

నేను డాక్టర్ ని కానందుకు గర్వపడుతున్నాను


                           ( త్వరలో )

Saturday, October 03, 2009

మా జగన్ ని సి.ఎం చేయండి : చంద్రబాబుకి వై.ఎస్ ఫోను

రాజశేఖర్ రెడ్డి మరణం - జగన్ ను సి.ఎం చేయాలన్న డిమాండ్లు - నిరసనల నేపధ్యంలో సరదాకి రాస్తున్న కల్పిత సంభాషణ.ఎవరినీ  బాధ  పెట్టడానికి  కాదు. 


పై లోకాల్లోనున్న వై.ఎస్ కు తన కొడుకు జగన్ ఇంకా సి.ఎం కాలేదన్న బెంగపట్టుకుంది. ఎలాగైనాసరే రంగంలోకి దిగి కొడుకుని సి.ఎం చేసెయ్యాలని ఫోన్ అందుకుని మొదట తన ప్ర్రియ మిత్రుడు K.V.P  కి డయల్ చేసాడు.

వై.ఎస్ : హలో ... మిత్రమా ఎలా ఉన్నావు?
కే.వి.పి : హలో ... ఎవరు? వై.ఎస్సా? ఎన్నాళ్లైంది మిత్రమా నీ గొంతు విని .... నెలరోజులైపోయింది కదూ!?.
వై.ఎస్ : (బాధగా ...) అవును. అంతా ఆ పాడు హెలికాప్టర్ వల్లే జరిగింది. ఇంతకూ మన జగన్ ని సి.ఎం చేసే  కార్యక్రమం ఎంతవరకూ వచ్చింది?
కే.వి.పి : (నాన్చుతూ ... ) ఆ పనిమీదే ఉన్నాను. జూనియర్లు అంతా  మన పక్షాన్నే .... సీనియర్లే  తలెగరేస్తున్నారు. నువ్వు వాళ్ళని తొక్కేసావన్న కోపంతో మన జగన్ కి సహకరిస్తాలేదు.
వై.ఎస్ : అవును మరి. మన కాంగ్రెస్ లో ఇదంతా కామనే. ఏది ఏమైనా జగన్ ని సి.ఎం చేసే బాధ్యత నీదే -   అని ఫోన్ పెట్టేసాడు.

   ఆ తరువాత రోశయ్యకి ఫోన్ చేసాడు

వై.ఎస్ : రోశయ్య గారు ఎలా ఉన్నారు?
రోశయ్య : నిక్షేపంలా ఉన్నాను .... అంతా మీ దయ.
వై.ఎస్ :  మా జగన్ ని సి.ఎం ఎప్పుడు చేస్తున్నారు?
రోశయ్య : నా చేతుల్లో ఏముంది - హై కమాండ్  ఎప్పుడంటే అప్పుడు
వై.ఎస్ : మీరు కూడా జగన్ కి  సపోర్ట్  చేస్తాలేదంట ? ... మా కే.వి.పి చెప్పాడు.
రోశయ్య : అబ్బబ్బే అలాంటిదేం లేదు.మీరంటే నాకు ఎంతో గౌరవం, అందుకే నేనింకా ....... సి- బ్లాక్ లోకి     మారలేదు. కొత్త పధకాలన్నింటికి మీ పేరే పెడుతున్నాను.



ఇక లాభం లేదని ... డైరెక్టుగా హై కమాండ్ తోనే ఈ విషయం తేల్చుకోవాలని సోనియా గాంధీకి ఫోన్ చేసాడు.

వై.ఎస్ :  నమస్కారం మేడం
సోనియా గాంధీ సెక్రటరి : నమస్కారం. ఎవరు మీరు?
వై.ఎస్ : నేను వై.ఎస్ ను
సెక్రటరీ : ఓ మీరా ?!  మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మేడం బిజీగా ఉన్నారు , తరువాత ఫోన్ చేయండి
వై.ఎస్ :( నేను సూటుకేసులతో డబ్బులిచ్చేటప్పుడు మేడం బిజీగా ఉండరేమో - అని మనసులో తిట్టుకుంటూ )  లేదు మేడంతో అర్జంటుగా మాట్లాడాలి.
     
  సోనియా గాంధీ లైన్లోకొచ్చారు

వై.ఎస్ : నమస్కారం మేడం
సోనియా : రెడ్డి గారు నమస్కారం ... ఎలా ఉన్నారు?
వై.ఎస్ : (బాధగా ... ) ఏదో ఉన్నాను మేడం - మా జగన్ ని ఎప్పుడు సి.ఎం చేస్తున్నారు?
సోనియా : ఇప్పుడు కుదరదు రెడ్డిగారు .... మీ వాడికి అనుభవం సరిపోదు,పైగా సీనియర్లు ఒప్పుకోవడంలేదు.
వై.ఎస్ :రాష్ట్రంలోని అన్ని  నిర్మాణాలకు, పధకాలకు  మీ అత్తగారూ,పెనిమిటి  పేర్లే  పెట్టాను పైగా   ముప్పైమూడు మంది ఎం.పి లను గెలిపించి మీ చేతిలో పెడితే ఇదా మీరు చూపించే కృతజ్ఞత?
సోనియా : తప్పదు వై.ఎస్. ఇదే రాజకీయమంటే .
వై.ఎస్ : ఇంకా నయం ఆంధ్రప్రదేశ్ ను రాజీవ్ ప్రదేశ్ గా మర్చేద్దామనుకున్నాను ... కొంపలంటుకుపోయేవి - అని ఫోన్ పెట్టేసాడు.         
 
వై.ఎస్ బాధపడుతూ అధికారంలో ఉన్నపుడు ఇవేమీ తెలిసేవి కాదు,ఇప్పుడు అందరి రంగులు బయటపడుతున్నాయి అని మనసులో అనుకుని చివరి ప్రయత్నంగా తన చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసాడు.
 
వై.ఎస్ : హలో .... చంద్రబాబూ ఎలా వున్నావు?
చంద్రబాబు : అన్నా నువ్వా!?  చాలా బాగున్నాను.
వై.ఎస్ : నువ్వైనా మా జగన్ ని  సి.ఎం చెయ్యొచ్చు కదా?
చంద్రబాబు : దానికి మీ పార్టీ వాళ్ళు వున్నారు కదా నేనెందుకు?
వై.ఎస్ : వాళ్ళెవరూ మా వాడ్ని పట్టించుకోవడం లేదు , కనీసం నువ్వైనా ........
చంద్రబాబు : నా వల్ల అవుతుందా ?
వై.ఎస్ : అమ్మమ్మా .... అలా అనకు   కేంద్రంలోనూ, రాష్ట్రంలోను  ఎన్నోసార్లు చక్రం తిప్పినోడివి - నీ వల్ల కాకపోతే ఇంకెవరివల్ల అవుతుంది.
చంద్రబాబు :( సంశయిస్తూ ..... ) నిజమే అనుకో ..... కానీ
వై.ఎస్ : కానీ లేదు గీనీ లేదు ..... అసెంబ్లీలో ఎన్ని తిట్టుకున్నా బయట మనమంతా ఒక్కటే కదా. మా వాడి కోసం మరోసారి చక్రం తిప్పు.
చంద్రబాబు :  చక్రం తిప్పడానికి మీ కే.వి.పి ఉన్నాడు కదా .... నేనెందుకు ? 
వై.ఎస్ : మా కే.వి.పి కి నీ అంత టాలెంటు లేదులే

చంద్రబాబు : ( ఏదో చెప్పబోతుండగా ....... )
     వాతావరణం సరిగా లేక లైన్ కట్ అయ్యింది . ఎన్నిసార్లు ప్రయత్నిచినా లైన్ కలవలేదు. వై.ఎస్ నిట్టురుస్తూ తన జగన్ సి.ఎం కాడేమోనన్న బెంగతో ఇడుపులపాయకి వెనుదిరిగాడు.


                       ఈ-మెయిల్ : msrinivasu275@gmail.com 

Thursday, October 01, 2009

ప్రజారాజ్యమా? లేక పరాయివాళ్ళ రాజ్యమా?





  ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. అక్కడ చిరంజీవి మాట కంటే ఇతర పార్టీల మాటే చెల్లుబాటు అవుతున్నట్లుంది. ఉన్న కొద్దిమంది నాయకులను కాపాడుకోవడానికి మెగాస్టార్ తంటాలు పడుతున్నారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై పట్టు లేనట్లు కనిపిస్తుంది. పార్టీకి వ్యూహం, దిశానిర్దేశం కొరవడింది - గాలి(రాజకీయగాలి) ఎటు వీస్తే అటు పోతున్నట్లుంది. యిటువంటి సందర్భాలలో మెగాస్టార్ పార్టీని నడపగలడా? అనే సందేహం సహజంగానే ఉదయిస్తుంది. అనాలోచితంగా ప్రకటనలు చేయడం  చిరంజీవికి అలవాటైపోయింది. మొన్నటికి ...మొన్న టెక్కలి అసెంబ్లీ ఉపఎన్నికలలో తమ అభ్యర్ధిని నిలపమన్న చిరంజీవి మాట తప్పారు. చివరికి ఆ ఎన్నికలో తమ అభ్యర్ధి డిపాజిట్ కోల్పోవడం ... దానికి కారణం తమ అభ్యర్ధి చేత విస్తృతంగా ప్రచారం చేయించకపోవడమే అని శెలవిచ్చారు. ఇదంతా చూస్తుంటే ... "వెనకటికి ఒకడు మింగలేక ఈ రోజు మంగళవారం అన్నాడట" అనే సామెత గుర్తురాకమానదు.  మంచైనా చెడైనా రాజకీయాల్లో కాస్తో కూస్తో కమిట్మెంట్(committment) అవసరం. అదిలేకపోతే జనం నమ్మరు.                                           
                                      

            భూమా నాగిరెడ్డి ....    శోభా నాగిరెడ్డి ....     కాటసాని రామిరెడ్డి                                             
   నిన్నటికి ...నిన్న ప్రజారాజ్యం పార్టీ కర్నూలు నాయకుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పావురాలగుట్ట వరకూ అనుసరించి జగన్ ను పరామర్శించారు. తదనంతరం జరిగిన నల్లకాలువ సభకు తమ అనుచరులతో హాజరవడమేగాక, ఆ సభకు జనాన్ని కూడా తరలించడం ప్రజారాజ్యం పార్టీ శ్రేణులకు మింగుడుపడని విషయం. ఈ సందర్భంలో వారు " జగన్ సి.ఎం అయితేబాగుటుంది" అని వాఖ్యానించారు. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో నున్న జగన్ ను పరామర్శించడంలో తప్పులేదు కాని రాజకీయప్రాధాన్యత( జగన్ సి.ఎం కావాలన్నా డిమాండ్ల నేపధ్యంలో) సంతరించుకున్న నల్లకాలువ సభకు జనాన్ని తరలించడం మరీ విడ్డూరం. రాజశేఖర రెడ్డి మరణానికి ముందే ఈ ముగ్గురూ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దమైనట్లు వార్తలొచ్చాయి. ఇదే విషయాన్నీ మీడియా మెగాస్టార్ వద్ద ప్రస్తావించగా ... తన పార్టీ వారు చేసిన దానికి ఏం చెప్పాలో తెలీక ... "అది వారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు" అని ముగించేశారు. బహూశా వారిపై చర్య తీసుకుంటే తన పార్టీ మరింత బలహీనపడుతుందని మెగాస్టార్ 'మెగా(MEGA)' భయం కావచ్చు. ఒక పార్టీలో ఉండి వేరొక పార్టీ సభకు జనాన్ని తరలించడం క్రీడాస్పూర్తా? లేక రాజకీయస్పూర్తా?. రాజకీయాల్లో క్రీడాస్పూర్తులుండవు - ఉన్నదల్లా రాజకీయస్పూర్తులే. "తనువు ఒక పార్టీలో - మనసు వేరొక పార్టీలో" పెట్టే పరాయివాల్లతో కలిసి మెగాస్టార్ సామాజికన్యాయం ఏ విధంగా సాధిస్తాడో?. ఇంతకూ ... ఆ ముగ్గిరికీ స్ఫూర్తి ఎవరు? తమ సామాజికవర్గానికి చెందిన వై.ఎస్. రాజశేఖర రెడ్డా? లేక సామాజికన్యాయం చేస్తానన్న చిరంజీవా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న మాత్రం కాదు.            
కూడలి
మాలిక: Telugu Blogs