Tuesday, June 28, 2011

డబ్బు తరలించుకోమని సత్యసాయి ట్రస్టుకు మరో పదిరోజుల గడువిచ్చిన ప్రభుత్వం


4 comments:

  1. శ్రీనివాసులు గారు,
    ఇప్పుడే చెప్పుదెబ్బలు బ్లాగులో మీరు రాసింది చదివాను.సరదాగా ఒకటొ రేండో కార్టున్స్ వేశారంటె అది వేరే విషయం. కాని మీరు తెలుగు వెలుగు వాడిలాగా చాలా అతి చేస్తున్నారుది.
    మన అందరికి తెలిసిందే మీడీయా అంతా ఒక వర్గం ఆదిపత్యం కింద ఉంది. వారి సిద్దాంతం అందరికి తెలిసిందే మొదట వ్యాపారం(డబ్బులు), తరువాత అధికారం, ఆపైన వీలైతే రేండొ పేళ్ళి ( కీప్ మైంటైన్ చేయటం ), ఫినిషింగ్ టచ్ గా వారిలో వారే వెన్నుపోటు పోడుచుకోవటం, యువరాజు పట్టభిషేకం అదే కథ మళ్ళీ మొదలు . వారి మైండ్ వీటీనుంచి బయట పడదు. వారిలో చాలామందికి పై విషయాలు తప్పించి మిగతా ఏ విషయాలు అర్థం కావు. మన దురదృష్ట్ట మేమిటంటే వారి చేతిలో మీడీయా ఉండటం వలన వారు రాసే గాసిపు/గాలి కబుర్లు, ఊహాగానాలు చదివి బుర్ర అవసరానికి మించి ఎక్కువ అనుమానించటం తో చెడిపోతున్నాది. తెలుగు వెలుగు లో 35లక్షలు చిక్కిన తరువాత పది కోట్లు వోల్వా బస్సులో దొరికాయని రాశారు. అది ఆయన పత్రికలో బ్రేకింగ్ న్యుస్ గా మధ్యహ్నం నుంచి రాత్రి వరకు ఉంట్టూ వచ్చింది. కాని పక్క రోజు ఆవార్త ఎక్కడా ఆ పేపర్ లోనే కనపడలేదు. అది ఆ పేపర్ నిజాయితి.
    మీడీయా రోజుకో అబద్దం, వారికి అవసరమైనది,అనుకూలమైనది రాసి అనుమానాలు రేకెతిస్తుంటారు.ఈ జబ్బు వారికి ముదిరి పోయింది. రాను రాను ఎవరిని ఎమాట అట్టున్నారో వారికి అర్థం కూడా కావటం లేదు.

    మంచి చెడ్డా లేకుండా, ముందు వెనుక చూడకుండా ఊరికినే బాబా మీద రాయటం మానుకొంటే మీకే మంచిది. మీకేమైనా అలా రాస్తే వ్యక్తిగత లాభం ఉంటే అది వేరే విషయం.

    పాత రోజుల్లో ఒక పెద్ద కవి, పండితుడు అయిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఆయన పాండిత్యాని చూసుకొని మురిసి పోయి, వయసులో బాబా మీద అవాకులు చవాకులు ఒక కథలో రాశాడు. చివరి దశలో ఆయనకి నోరు పడిపోయింది. మాట్లాడ లేకుండా మూగా అయిపోయింది. చెప్పవలసినది చెప్పాను. ఇదేదో మీకు హెచ్చరిక ని అనుకొవద్దు. మిమ్మల్ని రాయద్దు అని కాదు. కొంచెం విజ్ణతతో ఆలోచించమని విజ్ణప్తి అంతే. మీరు వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఉన్నారు కనుకా ఆస్థికుడని భావించి చెపుతున్నాను.

    ReplyDelete
  2. @Anon
    మీరు అనుకుంటున్నట్టు నేను ఆస్తికున్నే ... పైగా వెంకన్న భక్తున్ని ... అంతే కాని అడ్దమైన బాబాలకీమొక్కేవాన్ని కాదు ... బహుశా మీరు సాయి భక్తుడనుకుంటాను . అతనికి వ్యతిరేకంగా రాసినందుకు తట్టుకోలేక నాకు నోరు పడిపోవాలని శపిస్తున్నారు . ఒకవేళ నేను రాసింది తప్పైతే మీరన్నట్టే జరుగుతుంది . సాయిబాబాకి అంత సీన్ లేదు. అతనో No 1 కేడీ... అంతే... ఒకవేళ నేను రాసింది నిజమైతే ? అప్పుడు పరిస్థితేంటీ? ... ఇక్కడ ఇంకో విషయం ... నాకు బాబాలమీద చిన్నప్పటినుండీ (దాదాపు పదిహేనేళ్ళనుండి) కూడా మంచి అభిప్రాయం లేదు ... అందులోకీ ఈ సాయిమీద అసలే లేదు ... ఇదంతా మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఏర్పరచుకున్న అభిప్రాయం కాదు నా స్వానుభవమో కొంత ... గ్రాస్పింగ్ మరికొంత ... ఇకపోతే తెలుగు మీడియావాడికి ఉన్న మూడు లక్షణాలు మీరు చెప్పారు( డబ్బు పోగేయడం ... అధికారం సంపాధించడం ... తరువాత కీప్‌ను మైంటైన్ చేయడం ). ఇదంతా సంఘటిత రంగంలోనున్న ప్రింట్ , ఎలెక్ట్రానిక్ మీడియాలవాళ్ళ వల్ల అవుతుంది. కానీ నావల్ల అవ్వదు నాకు వర్తించదు. ఎందుకంటే కేవలం నా ఈ చిన్న బ్లాగువలన మీరు చెప్పిన ఆ మూడు లక్షణాలలో ఏదీ సాధ్యం కాదు ... కారణం ... INTERNET అసంఘటిత రంగంలో ఉంది . INTERNET ఎవడి బాబు సొత్తూ కాదూ (పేపరూ , టీవీ అయితే వాడి ఇష్టమొచినట్టు వాడు రాసుకోవచ్చు , చూపించుకోవచ్చు). అక్కడ ఖండన ముండనలకు చోటులేదు .ఒకవేళ ఖండించినా వాటిని ప్రచురించరు ... టెలికాస్టూ చేయరు. కానీ ఇక్కడ అలా కాదు ... బ్లాగులోనే ఒక కామెంట్ పెట్టొచ్చు (మీరు పెట్టినట్టు) ... ఇంకా నచ్చకపోతే వ్యతిరేకంగా ఒక బ్లాగే ఓపెన్ చేయొచ్చు. SO నాకు అధికార మానియా గానీ , అవినీతి ఫోబియా గానీ లేదని మీకీపాటికి అర్ధమైపోయుంటుంది.

    ReplyDelete
  3. *అతనికి వ్యతిరేకంగా రాసినందుకు తట్టుకోలేక నాకు నోరు పడిపోవాలని శపిస్తున్నారు.*
    మిత్రమా ఇదా మీకర్థమైంది. ఇంత అనాలిసిస్ చేసే మీరు ఒక చిన్న పాయింట్ మరచి పోయారు. మీకు నోరు పడిపోవాలని నేను కోరుకుంటే, అదొక్క ముక్క రాయవచ్చు లేక మిమల్ని తిట్టవచ్చు. పైన అంత ఉపోద్గాతం ఎందుకు మీడియా గురించి రాస్తాను? బాబాగారు సాక్షత్ ప్రేమ స్వరూపం అటువంటి ఆయన గురించి చదివి, తెలుసుకొని నీ బోటి అమాయకుడిని నోరు పడిపోవాలని అంటానా! నా ఉద్దేశం తెలివి, చదువు, విద్వత్తు ఉన్నా కొన్ని సార్లు దేవులపల్లి లాంటి వారు కూడా నోరు జారారు అని అర్థం.

    ReplyDelete
  4. * సాయిబాబాకి అంత సీన్ లేదు. అతనోఅతనో నం1 కేడీ... అంతే... ఒకవేళ నేను రాసింది నిజమైతే ? అప్పుడు పరిస్థితేంటీ?*

    నువ్వు రాసింది ఎప్పటికి నిజం కాదు. అది నాకు ఖచ్చితంగా తెలుసు. ఈ దేశం లో అత్యున్నత పదవులు, ఆయారంగాలలో అత్యున్నత స్థాయికి చెదిన అన్ని రంగాల వారి మీద వారి నిర్ణయాల మీద నాకు ఎంతో నమ్మకం. అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్,మన్మోహన్ సింగ్, సుబ్రమణ్య స్వామి, అద్వాని, పి.వి. నరసిం హా రావు, వాజ్ పాయ్, అమితాబచ్చన్, ఐశ్వర్య రాయ్, సచ్చిన్, గవస్కర్, శ్రీశాంత్, శ్రీలంక క్రికేటర్ అర్జున రణతుంగా, యం.యస్. సుబ్బు లక్ష్మి, కవిత కృష్ణమూర్తి, మహమద్ రఫీ, ఘంటసాలా, పి.సుశీల మరియు డాక్టర్ || పి.వేణుగోపాల్ (ఇతను భారత దేశం లో మొదటి గుండేమార్పిడి ఆపరేషన్ డిల్లీ ఎయింస్ ఆసుపత్రిలో రిక్షా వాడికి చేశాడు). ఇతనే పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషలిటి ఆసుపత్రిలో మొదటి ఆపరేషన్ చేసినది, వీలున్నపుడలా అక్కడికి డిల్లి నుంచి వేళ్ళి చేసి వస్తూంటాడు. ఇతను ప్రపంచం లో టాప్ డాక్టర్స్ లో ఒకడు. ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిన అమేరికా డాక్టర్ కొన్ని వేల గుండెమార్పిడులు చేసారు. ఆయన వేణుగోపాల్ గారిని నాదగ్గర పని చేసిన వారిలో ఇతను "ది బేస్ట్ డాక్టర్" అని చెప్పాడు. రాజకీయాలలో ఉంట్టు కూడా మాజి ప్రధాని వాజ్ పాయ్ గారు వీలు చిక్కినపుడల్లా ఆయన్ పెట్టిన విద్యాలయాలో పిల్లలకు పాటాలు బెంగళురుకి వేళ్ళి భోదించే వారు. వివిధ రంగాలకు చెందిన వీళ్ళందరు ఒక కేడి ని నమ్మటానికి పిచ్చి వాళైతెకారు. వాళ్ళు పిచ్చి వారైతే ఈ పాటికే దేశం పని అయిపోయి ఉండేది. నేను ఇక్కడ రాసింది మనదేశం వారి గురించి మాత్రమే. నేను చెప్పిన వీరంతా ఆయనని కలవటానికి, అది ఆయన నివసిస్తున్న మారు మూల పల్లెకు వెళ్ళిచూసి రావలసిన అవసరం ఎమీలేదు. నువ్వు చూడబోతే ఒక పిచ్చి నమ్మకం తో మీరు రాసేవి నిజమౌతాయని అనుకొంట్టునట్టు ఉన్నావు. ఆయన బ్రతికి ఉండగా 75ఏళ్లు గా ఆయనని విమర్శించే వారు ఒక్క ఇంచ ఆయన భక్తులను మార్చలేక పోయారు. మీరు పగటి కలలు కనటం మానండి.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs